కొవిడ్‌తో ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-10-15T06:55:53+05:30 IST

జిల్లాలో బుధ, గురువారాల నడుమ కొవిడ్‌తో ఇద్దరు చనిపోగా 120 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది

కొవిడ్‌తో ఇద్దరి మృతి

తిరుపతి, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధ, గురువారాల నడుమ కొవిడ్‌తో ఇద్దరు చనిపోగా 120 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 1933కు చేరగా కేసుల సంఖ్య 245501కి పెరిగింది. కాగా గురువారం ఉదయానికి జిల్లాలో 1019 యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు వున్నాయి. కొత్తగా గుర్తించిన పాజిటివ్‌ కేసులు చిత్తూరులో 19, తిరుపతి నగరంలో 16, తిరుపతి రూరల్‌లో 14, రేణిగుంటలో 7, పులిచెర్లలో 6, పలమనేరులో 5, మదనపల్లె, పుంగనూరు, చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, తంబళ్లపల్లె మండలాల్లో 4 వంతున, పీలేరు, పూతలపట్టు, ఐరాల, రొంపిచెర్ల మండలాల్లో 3 చొప్పున, శ్రీకాళహస్తి, పాకాల, వాల్మీకిపురం, కలికిరి, ఏర్పేడు, తొట్టంబేడు, కలకడ మండలాల్లో 2 వంతున, పుత్తూరు, నగరి, శ్రీరంగరాజపురం, కేవీపల్లె, కేవీబీపురం, పెద్దపంజాణి, విజయపురం మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి.

Updated Date - 2021-10-15T06:55:53+05:30 IST