రైలు ఢీకొని ఇద్దరు రైల్వే ఉద్యోగుల మృతి

ABN , First Publish Date - 2021-05-08T08:31:06+05:30 IST

మహబూబాబాద్‌ శివారులో శుక్రవారం రైలు ఢీకొనడంతో రైల్వేట్రాక్‌పై విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు.

రైలు ఢీకొని ఇద్దరు రైల్వే ఉద్యోగుల మృతి

ట్రాక్‌పై పనులు చేస్తుండగా ప్రమాదం

మహబూబాబాద్‌ రూరల్‌, మే 7: మహబూబాబాద్‌ శివారులో శుక్రవారం రైలు ఢీకొనడంతో రైల్వేట్రాక్‌పై విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. డోర్నకల్‌ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్‌ మండలం పాతరెడ్యాల గ్రామానికి చెందిన వేంపల్లి కమలాకరాచారి (32) ట్రాక్‌మేన్‌గా, మహబూబాబాద్‌ రైల్వే క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఎండీ.యాకూబ్‌పాషా(40) కలాసీ(పెయింటర్‌)గా రైల్వేశాఖలో పనిచేస్తున్నారు. రోజువారీ విధుల్లో భాగంగా ఉదయం మహబూబాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలో 434/15 మైలు రాయి వద్ద  విధుల్లో నిమగ్నమై ఉన్న వారిద్దరినీ విజయవాడ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌  ఢీకొట్టింది. మూలమలుపువద్ద పనిచేస్తున్న వీరు రైలు రాకను పసిగట్టలేకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డోర్నకల్‌ రైల్వే హెడ్‌కానిస్టేబుల్‌ సత్యనారాయణరెడ్డి తెలిపారు. యాకూబ్‌పాషాకు భార్య అప్సర, కుమార్తె ఉన్నారు. కమలాకరాచారికి ఏడాది క్రితమే వివాహమైంది.  

Updated Date - 2021-05-08T08:31:06+05:30 IST