రెండు రోడ్లకు నిధులు మంజూరు

ABN , First Publish Date - 2020-11-28T05:34:15+05:30 IST

జిల్లాలో రెండు రహదారుల అభివృద్ధి, విస్తరణకు నిధులు మంజూరయ్యాయి.

రెండు రోడ్లకు నిధులు మంజూరు

 ఏలూరు, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు రహదారుల అభివృద్ధి, విస్తరణకు నిధులు మంజూరయ్యాయి. కాళీపట్నం–జగన్నాథపురం మధ్య 10.75 కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.12 కోట్లు, ఆచంట–సిద్ధాంతం, పెనుగొండ– దేవ మధ్య 12.73 కిలోమీటర్ల రోడ్డు విస్తరణ, అభివృద్ధికి రూ.15 కోట్లు మంజూ రు చేస్తూ రాష్ట్ర రోడ్లు, రవాణా శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రవాణా శాఖ పరధిలోని సెంట్రల్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్టక్చర్‌ ఫండ్‌(సీఆర్‌ఐఎఫ్‌) నిధు లు మంజూరుకు అనుమతి రావడంతో పనులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా 35 పనులకు సంబంధించి రూ.681 కోట్ల మంజూరుకు కేంద్రం అనుమ తించినట్లు జీవో పేర్కొంది.

Updated Date - 2020-11-28T05:34:15+05:30 IST