హైదరాబాద్లో అక్కాచెల్లెల్లు అదృశ్యం
ABN , First Publish Date - 2021-06-12T17:51:40+05:30 IST
వరుసకు అక్కాచెల్లెల్లు అయిన ఇద్దరు బాలికలు ఇంటి నుంచి బయటికి వెళ్లి
హైదరాబాద్ సిటీ/మదీన : వరుసకు అక్కాచెల్లెల్లు అయిన ఇద్దరు బాలికలు ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగిరాలేదు. ఈ ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఛత్రినాక జీ.ఎంఛావుని ప్రాంతానికి చెందిన మున్నీ బేగం కుమార్తె ఉజ్మా (15), ఆమె చెల్లి కుమార్తె నిషా (15)లు ఇద్దరు కలిసి ఈనెల 10న 3 గంటలకు పూల్బాగ్లో ఉండే సోదరి ఇంటికి వెళ్లారు. గంట తర్వాత వస్తామని చెప్పారు. ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి మున్నీబేగం పూల్బాగ్లో ఉండే కూతురుకు ఫోన్ చేస్తే ఇక్కడినుంచి వెళ్లిపోయారని చెప్పింది. అయినా ఇంటికి చేరకపోవడంతో తెలిసిన వారు, బంధువుల వద్ద వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.