ఒకరికి 18 ఏళ్లు.. మరొకరికి 13 ఏళ్లు.. కూలి పనికి వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంట్లో ఉన్న ఆ అక్కాచెల్లెళ్లు చేసిన దారుణమిది..!

ABN , First Publish Date - 2021-10-28T22:27:05+05:30 IST

ఆ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకరికి 18ఏళ్లు ఉండగా, మరొకరు 13ఏళ్ల వయసు ఉంటారు. ఎప్పుడూ ఈ అక్కాచెల్లెళ్లు కలిసే ఉంటారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ అక్కాచెల్లెళ్లు దారుణా

ఒకరికి 18 ఏళ్లు.. మరొకరికి 13 ఏళ్లు.. కూలి పనికి వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంట్లో ఉన్న ఆ అక్కాచెల్లెళ్లు చేసిన దారుణమిది..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. ఒకరికి 18ఏళ్లు ఉండగా, మరొకరు 13ఏళ్ల వయసు ఉంటారు. ఎప్పుడూ  ఈ అక్కాచెల్లెళ్లు కలిసే ఉంటారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఈ అక్కాచెల్లెళ్లు దారుణానికి పాల్పడ్డారు. దీంతో వారికి సంబంధించిన విషయం స్థానికంగా చర్చనీయాంశం అయింది. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. 


రాజస్థాన్‌లోని బికనీర్ ప్రాంతానికి చెందిన గోపాల్ అనే వ్యక్తికి నలుగురు సంతానం. వారిలో రెండో కూతురి పేరు సరస్వతి కాగా.. చిన్నమ్మాయి పేరు సరిత. సరస్వతి బికనీర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుండగా.. సరిత స్థానికంగా ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. వీరికి ఓ అక్కా.. సోదరుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ వీరిద్దరే ఎక్కువగా కలిసి మెలిసి ఉండేవారు. ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవారు. కాగా.. ఎప్పటిలాగే తాజాగా బుధవారం రోజు గోపాల్, తన భార్య.. ఇద్దరూ కూలీ పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి, సరస్వతి, సరిత దారుణానికి పాల్పడ్డారు.


గదిలో ఒకరు, వరండాలో మరొకరు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పని ముగించుకుని.. సాయంత్రం ఇంటికి చేరుకున్న గోపాల్ అతడి భార్య.. ఇద్దరు బిడ్డలు విగత జీవులుగా వేలాడుతున్న దృశ్యాలను చూసి, శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా.. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పటల్‌కు తరలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఇంట్లో ఎటువంటి సూసైడ్‌ నోట్ లభించలేదని చెప్పారు. వారి ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే కోణంలో విచారణ జరుపుతున్నట్టు పేర్కొన్నారు. 




Updated Date - 2021-10-28T22:27:05+05:30 IST