హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

ABN , First Publish Date - 2021-08-12T22:24:41+05:30 IST

నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలో ఉన్న గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు

హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ సమీపంలో ఉన్న గండిపేట వద్ద జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిని సుచిత్రకు చెందిన కౌశిక్, జో డౌన్ అనే విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. గండిపేట సీబీఐటి రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని కారు ఢీకొట్టుకుని ఇద్దరు విద్యార్థులు  మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.


గండిపేట నుంచి నార్సింగ్ వైపు కారులో ఐదుగురు విద్యార్థులు వెళ్తున్నారు. కారు నడిపే సమయంలో రోడ్డు మీద ఆటో అడ్డు వచ్చింది. దీంతో ఆటోను తప్పించబోయి కరెంటు స్తంభాన్ని కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. సీబీఐటీ కాలేజీలో ఎగ్జామ్ ఉందని కౌశిక్ అనే విద్యార్థి వచ్చి మృత్యువాత పడ్డాడు. సంఘటనా స్థలానికి చేరుకొని నార్సింగ్ పోలీసులు విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-12T22:24:41+05:30 IST