బెంగళూరులో COVID ఏవై.4.2 కొత్త వేరియంట్

ABN , First Publish Date - 2021-10-27T15:06:11+05:30 IST

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కరోనావైరస్ యొక్క ఏవై.4.2 కొత్త వేరియంట్ రెండు అనుమానిత కేసులు వెలుగుచూశాయి....

బెంగళూరులో COVID ఏవై.4.2 కొత్త వేరియంట్

బెంగళూరు(కర్ణాటక): కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో కరోనావైరస్ యొక్క ఏవై.4.2 కొత్త వేరియంట్ రెండు అనుమానిత కేసులు వెలుగుచూశాయి. కరోనా కొత్త వేరియెంట్ ను గుర్తించేందుకు వీటి నమూనాలను జన్యు శ్రేణి కోసం ప్రయోగశాలకు పంపినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి కె సుధాకర్  చెప్పారు.శాంపిల్స్‌ను పరీక్షల నిమిత్తం బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (ఎన్‌సీబీఎస్)కు పంపినట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.కరోనా కొత్త వేరియెంట్ సోకిన బాధిత వ్యక్తులిద్దరూ బెంగళూరుకు చెందిన వారని, వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కూడా వైద్యాధికారులు తెలిపారు.


 ఏవై.4.2 అనే కొత్త వేరియెంట్ యునైటెడ్ కింగ్‌డమ్‌లో వేగంగా విస్తరిస్తున్న కరోనావైరస్ యొక్క డెల్టా వేరియంట్ అని డాక్టర్లు చెప్పారు.కరోనా కొత్త వేరియెంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటకలో ఏడు జీనోమ్ ల్యాబ్ లను ఏర్పాటు చేశామని మంత్రి సుధాకర్ చెప్పారు.కొత్త కరోనా వేరియంట్ వచ్చినప్పుడల్లా రాష్ట్రం వెంటనే నిపుణుల సలహాలను పొందవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ తో చర్చిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.



అయితే, రెండు డోసుల కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారు కొత్త వైరస్ వేరియెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదని, అది వారిపై తక్కువ ప్రభావం చూపుతుందని మంత్రి సుధాకర్ పేర్కొన్నారు.ఈ కొత్త వేరియెంట్ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నందున ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ వివరించారు.

Updated Date - 2021-10-27T15:06:11+05:30 IST