దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2021-10-24T04:59:54+05:30 IST

కదిరి రోడ్డు మార్కెట్‌యార్డు చెక్‌పోస్టు వద్ద ఈనెల 18న జరిగిన దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు.

దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు
నిందితుల అరెస్టును చూపుతున్న సీఐ భాస్కర్‌రెడ్డి

పులివెందుల టౌన్‌, అక్టోబరు 23: కదిరి రోడ్డు మార్కెట్‌యార్డు చెక్‌పోస్టు వద్ద ఈనెల 18న జరిగిన దోపిడీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. శనివారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ నిందితులు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం వాసులు యువరాజ్‌ పవార్‌, అన్నకొడుకు రాజనటరాజ్‌ పవార్‌ ఇద్దరు కలిసి మార్కెట్‌యార్డు చెక్‌ పోస్టు వద్ద రోడ్డుపక్కన నిలిపి ఉన్న సిమెంట్‌ లారీ వెనుక వైపు క్యాబిన్‌ను రా యితో పగులకొట్టి లోపలికి ప్రవేశించారన్నారు. డ్రైవర్‌ను కత్తితో బెదిరించి రూ.14 వేలు నగదు, సెల్‌ఫోన్‌ను తీసుకుని పారిపోయారన్నారు.

అనంతరం వీరు ముద్ద నూరు, చిలంకూరు, యర్రగుంట్ల పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ మళ్లి పులివెం దుల టౌన్‌కు బైకులో వస్తుండగా వారిని శనివారం అరెస్టు చేశామన్నారు. వారి నుంచి రూ.7వేలు నగదు, సెల్‌ఫోన్‌, కత్తి, యమహా బైకును స్వాధీనం చేసుకు న్నామన్నారు. ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T04:59:54+05:30 IST