భారత్‌కు రెండు స్విమ్మింగ్‌ బెర్త్‌లు!

ABN , First Publish Date - 2021-06-23T09:33:00+05:30 IST

భారత స్విమ్మర్లు శ్రీహరి నటరాజన్‌, మానా పటేల్‌ను అదృష్టం వరించింది. యూనివర్సాలిటీ ప్లేసెస్‌..

భారత్‌కు రెండు స్విమ్మింగ్‌ బెర్త్‌లు!

న్యూఢిల్లీ: భారత స్విమ్మర్లు శ్రీహరి నటరాజన్‌, మానా పటేల్‌ను అదృష్టం వరించింది. యూనివర్సాలిటీ ప్లేసెస్‌ క్వాలిఫికేషన్‌ కింద వీరిద్దరినీ ఒలింపిక్స్‌కు నామినేట్‌ చేసినట్టు భారత స్విమ్మింగ్‌ సమాఖ్య తెలిపింది. సాధారణ ప్రక్రియ ద్వారా ఒలింపిక్స్‌కు ఎవరూ అర్హత సాధించని పక్షంలో.. ఆ దేశం నుంచి మెరుగైన ర్యాంక్‌ లోనున్న పురుషులు, మహిళల నుంచి ఒకరి చొప్పున యూనివర్సాలిటీ కోటా కింద విశ్వక్రీడలకు నామినేట్‌ చేయవచ్చు. పురుషుల్లో శ్రీహరి 863 పాయింట్లు, మహిళల్లో మానా 735 పాయింట్లతో టాప్‌లో ఉన్నారు. 

Updated Date - 2021-06-23T09:33:00+05:30 IST