బారాముల్లాలో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2020-07-11T16:07:35+05:30 IST

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నౌగాం సెక్టారులో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు....

బారాముల్లాలో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

నౌగాం (జమ్మూకశ్మీర్):  జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా నౌగాం సెక్టారులో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. నౌగాం సెక్టారులోని సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలో పహరా కాస్తున్న భద్రతా బలగాలకు ఉగ్రవాదులు తారసపడ్డారు. జవాన్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద రెండు ఏకే-47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్ అనంతరం సరిహద్దుల్లో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతంలో దాక్కున్న ఉగ్రవాదుల కోసం జవాన్లు గాలింపు కొనసాగిస్తున్నారు. సరిహద్దుల్లో పాక్ నుంచి ఉగ్రవాదులను అక్రమంగా మన దేశంలోకి పంపేందుకు పాక్ యత్నిస్తోంది. పాక్ ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భారత సైనికులు తిప్పికొట్టారు. దీంతో సరిహద్దుల్లో పలుసార్లు ఎన్‌కౌంటర్ లు సాగాయి. 

Updated Date - 2020-07-11T16:07:35+05:30 IST