జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2020-04-04T14:29:02+05:30 IST

దేశంలో కరోనా లాక్‌డౌన్ విధించిన సమయంలో జమ్మూకశ్మీర్ లోని కుల్గాం పట్టణంలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య శనివారం ఉదయం ఎన్‌కౌంటర్....

జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్..ఇద్దరు ఉగ్రవాదుల హతం

కుల్గాం (జమ్మూకశ్మీర్): దేశంలో కరోనా లాక్‌డౌన్ విధించిన సమయంలో జమ్మూకశ్మీర్ లోని కుల్గాం పట్టణంలో పాక్ ప్రేరిత ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య శనివారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కుల్గాం పట్టణంలో దాక్కున్నారని జమ్మూకశ్మీర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు భద్రతా బలగాలతో కలిసి కుల్గాంలో శనివారం ఉదయం గాలింపు చేపట్టారు. ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సాయుధ పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు.

Updated Date - 2020-04-04T14:29:02+05:30 IST