మహారాష్ట్ర జైళ్లలో 2,061మంది ఖైదీలు, 421 మంది సిబ్బందికి కరోనా

ABN , First Publish Date - 2020-09-24T13:54:02+05:30 IST

మహారాష్ట్రలోని జైళ్లలో 2,061 మంది ఖైదీలు, 421 మంది జైలు సిబ్బందికి కరోనా సోకిందని జైళ్ల శాఖ తాజాగా వెల్లడించింది...

మహారాష్ట్ర జైళ్లలో 2,061మంది ఖైదీలు, 421 మంది సిబ్బందికి కరోనా

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్రలోని జైళ్లలో 2,061 మంది ఖైదీలు, 421 మంది జైలు సిబ్బందికి కరోనా సోకిందని జైళ్ల శాఖ తాజాగా వెల్లడించింది.ఆరుగురు ఖైదీలు, ఐదుగురు జైలు సిబ్బది కరోనాతో మరణించారు. పూణే నగరంలోని ఎరవాడ సెంట్రల్ జైలులో అత్యధికంగా 261 మంది ఖైదీలు, 43 మంది జైలు సిబ్బందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో 1767 మంది ఖైదీలు, 372 మంది జైలు సిబ్బంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో 2,73,477 మందికి కరోనా సోకగా,వారిలో 33,886 మంది మరణించారు.

Updated Date - 2020-09-24T13:54:02+05:30 IST