రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్ల మృతి

ABN , First Publish Date - 2020-08-14T11:22:27+05:30 IST

జాతీయరహదారిపై లోడ్‌తో వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడి మరణించిన ఘటన....

రెండు లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్ల మృతి

నలుగురికి తీవ్ర గాయాలు

భోపాల్ (మధ్యప్రదేశ్): జాతీయరహదారిపై లోడ్‌తో వస్తున్న రెండు లారీలు ఢీకొన్న ప్రమాద ఘటనలో ఇద్దరు డ్రైవర్లు అక్కడి మరణించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్-నాగపూర్ జాతీయ రహదారిపై జరిగింది. బియ్యం, బత్తాయిల లోడ్ లతో వస్తున్న రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ  ప్రమాద ఘటనలో రెండు లారీల డ్రైవర్లు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని మధ్యప్రదేశ్ పోలీసులు చెప్పారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసు అధికాి నీలేష్ పర్టేటీ చెప్పారు.

Updated Date - 2020-08-14T11:22:27+05:30 IST