Jammu and Kashmir: కుల్గాంలో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-12-16T13:03:39+05:30 IST

జమ్మూకశ్మీర్ పరిధిలోని కుల్గామ్‌లో గురువారం జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు....

Jammu and Kashmir: కుల్గాంలో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ పరిధిలోని కుల్గామ్‌లో గురువారం జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు.కుల్గాం జిల్లాలోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని అందిన నిర్దిష్ట సమాచారం ఆధారంగా జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్త బృందం గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది.గాలింపు సాగుతుండగా ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి.ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశంలో భద్రతా బలగాలు దాడి చేయడంతో ఎన్‌కౌంటర్‌కు దారితీసింది. భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య భారీ కాల్పులు జరిగాయి.ఈ ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారని జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. ఉగ్రవాదుల కోసం తమ బృందాలు ఇంకా గాలిస్తున్నాయని పోలీసులు వివరించారు.


Updated Date - 2021-12-16T13:03:39+05:30 IST