సమాజం ఎలా తయారైందో చెప్పడానికి ఈ ఇద్దరు భార్యలే ఉదాహరణ.. ఇద్దరూ ఒకే తరహా తప్పు చేసి.. తప్పించుకునేందుకు..

ABN , First Publish Date - 2021-10-24T06:29:50+05:30 IST

భార్యా భర్త సంబంధం ఎంతో గొప్పదంటారు. మన భారతదేశంలో వివాహ బంధానికి ఇంకా ఎంతో విలువనిస్తారు. కానీ అలాంటి బంధానికి..

సమాజం ఎలా తయారైందో చెప్పడానికి ఈ ఇద్దరు భార్యలే ఉదాహరణ.. ఇద్దరూ ఒకే తరహా తప్పు చేసి.. తప్పించుకునేందుకు..

భార్యా భర్త సంబంధం ఎంతో గొప్పదంటారు. మన భారతదేశంలో వివాహ బంధానికి ఇంకా ఎంతో విలువనిస్తారు. కానీ అలాంటి బంధానికి కళంకం తెచ్చేలా ప్రవర్తించారు ఇద్దరు మహిళలు. సొంత భర్తలనే హతమర్చి ఏమీ తెలియనట్లు ముసలి కన్నీరు కార్చారు. కానీ పాపం ఎక్కువ రోజులు దాగదు. వీరి విషయంలోనూ అదే జరిగింది. చిన్ని ఆధారాలు లభించడం, పోలీసుల అనుమానం వీరిద్దిరి మీదకు షిఫ్ట్ అయింది. ఆధారాలు కూడా లభించడంతో ఇద్దరినీ అరెస్టు చేసి జైలుకు తరలించారు.


మొదటి సంఘటన బిహార్‌లోని పోఖారియా ప్రాంతంలో జరిగింది. అక్టోబర్ 20న నగర పోలీస్ స్టేషన్ పరిధిలోని పోఖారియా వార్డ్ నంబర్ 36 లో ఒక యువకుడిని దారుణంగా కాల్చి చంపారు. చాలా తెలివిగా, అతని మృతదేహాన్ని అతని గదికి తీసుకెళ్లారు. సాయంత్రం వరకు ఆ యువకుడు గదిలో నుంచి బయటకు రాకపోవడంతో ప్రజలకు అనుమానం వచ్చింది. మృతుడు సుశాంత్ కుమార్ పాశ్వాన్ అలియాస్ పింటు కుమార్ పాశ్వాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ హత్య విషయంలో పోలీసుల అనుమానం మొదటి నుంచి అతడి భార్య జయశ్రీ, అత్తమామలపైనే ఉంది. అయితే అక్కడ భర్తను దారుణంగా చంపి.. ఆ తర్వాత తనకేం తెలియనట్లు భార్య రోదించసాగింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయింది. ఆమె పరిస్థితి చూస్తే ఆమె హత్య చేసిందంటే ఎవ్వరూ నమ్మరు. అలా నటించ సాగింది. అయితే జయశ్రీ అక్రమ సంబంధమే కారణం అని మృతుని బంధువులు జయశ్రీతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, ఇతర బంధువులపై పోలీసుల ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే జయశ్రీ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేసింది.


ఇక రెండో హత్య బీర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్రా గ్రామంలో జరిగింది. అక్టోబరు 21న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ డ్రైవర్‌ను పదునైన ఆయుధంతో దారుణంగా హత్య చేసి ఆ తర్వాత అతడి మృతదేహాన్ని ఇంటి నుంచి 50 అడుగుల దూరంలో పడేశారు. ఈ హత్యలో పోలీసులకు ఎలాంటి ఆధారం మొదట లభించలేదు. అయితే మృతుడి ఏడేళ్ల కుమారుడు హత్య రహస్యాన్ని వెల్లడించడంతో భార్య ముఖం బయటపడింది. నేరం బయటపడడంతో నీతూ తన నేరాన్ని ఒప్పుకుంది. తన భర్త ఎక్కువగా తాగేవాడని చెప్పాడు. ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని, తరచూ ఆమెను కొట్టేవాడని భార్య నీతూ చెప్పుకొచ్చింది. అదే సమయంలో బచ్వారా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే గౌతమ్ కుమార్ అనే యువకుడితో ప్రేమలో పడింది. ఈ ప్రేమ నేపథ్యంలోనే గౌతమ్, మరో స్నేహితుడితో కలిసి, ఇంట్లోనే పదునైన ఆయుధంతో మంటోష్ కుమార్ గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత మృతదేహం ఇంటి ప్రాంగణానికి 50 అడుగుల దూరంలో విసిరివేయబడింది. అతని ఏడేళ్ల కొడుకు చూశాడు. పోలీసులకు అతడు చెప్పడంతో ప్రస్తుతం, ఇద్దరు మహిళలను అరెస్టు చేసి జైలుకు పంపడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు.


Updated Date - 2021-10-24T06:29:50+05:30 IST