నార్సింగ్లో ఇద్దరు మహిళలు అదృశ్యం
ABN , First Publish Date - 2021-03-30T16:31:38+05:30 IST
ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. వికారాబాద్కు చెందిన..
హైదరాబాద్/నార్సింగ్ : ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారు. వికారాబాద్కు చెందిన కృష్ణవేణి(30), మల్లేష్ దంపతులు తమ రెండేళ్ల బాబుతో కలిసి నార్సింగిలో కొంతకాలంగా నివసిస్తున్నారు. ఎప్పటిలాగే సోమవారం పనికివెళ్లిన మల్లేష్ మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చేసరికి భార్య కృష్ణవేణి కనిపించలేదు. బంధువులను సంప్రదించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో సంఘటనలో హైదర్షాకోట్కు చెందిన ఓబ్యానాయక్ టెక్స్టైల్ వర్కర్గా పనిచేస్తూ భార్య నీలాబాయి(22)తో కలిసి ఉంటున్నాడు. సోమవారం విధుల నుంచి వచ్చేసరికి భార్య ఇంట్లో లేదు. ఇరుగు పొరుగు, బంధువులను విచారించినా ఆచూకీ లభించలేదు. ఓబ్యా నాయక్ పోలీసులను ఫిర్యాదు చేశాడు.