రెండేళ్లకే నూరేళ్లు నిండాయి

ABN , First Publish Date - 2022-01-23T05:06:13+05:30 IST

ఓ చిన్నారికి రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. కారు చక్రాల కింద పడి ప్రాణాలు నలిగిపోయాయి. ప్రమాదవశాత్తు కారు కిందకు వెళ్లిందో లేక కారు ఆ చిన్నారిని ఢీకొట్టిందో తెలియదు కానీ ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శనివారం నెల్లూలోని గుప్తా పార్కు సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది.

రెండేళ్లకే నూరేళ్లు నిండాయి
మృతి చెందిన చిన్నారి

కారు చక్రాల కింద నలిగిన చిన్నారి ప్రాణాలు

నెల్లూరు(క్రైం),జనవరి 22: ఓ చిన్నారికి రెండేళ్లకే నూరేళ్లు నిండిపోయాయి. కారు చక్రాల కింద పడి ప్రాణాలు నలిగిపోయాయి. ప్రమాదవశాత్తు కారు కిందకు వెళ్లిందో లేక కారు ఆ చిన్నారిని ఢీకొట్టిందో తెలియదు కానీ ఆ చిన్నారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శనివారం నెల్లూలోని గుప్తా పార్కు సమీపంలో ఈ విషాద ఘటన జరిగింది. ట్రాఫిక్‌ పోలీసుల వివరాల మేరకు నరసింహకొండ వద్ద ధనమ్మ కాలనీకి చెందిన మణి, రవణమ్మ దంపతులకు రెండేళ్ల కూతురు ఉంది. కాగితాలు ఏరుకుంటూ నెల్లూరు నగరానికి వచ్చిన వారు సంతపేట గుప్తా పార్కు వద్ద శనివారం మధ్యాహ్నం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో చిన్నారి ఆడుకుంటూ కారు కిందకు దూరింది. రాజంపేటకు చెందిన వ్యక్తి కారును ముందుకు తీయడంతో  చిన్నారి కారు చక్రాల మధ్య ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో కారు నడుపుతున్న వ్యక్తి పరారయ్యాడు. స్థానికులు ట్రాఫిక్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Updated Date - 2022-01-23T05:06:13+05:30 IST