విశాఖలో రెండేళ్ల చిన్నారి అదృశ్యం

ABN , First Publish Date - 2020-02-11T14:45:17+05:30 IST

విశాఖ: భర్తతో గొడవపడి తన రెండేళ్ల చిన్నారితో ఇల్లు విడిచి వెళ్లిపోయిన మహిళ.. కూతురి జాడను వెల్లడించలేకపోవడం కలకలం రేపుతోంది.

విశాఖలో రెండేళ్ల చిన్నారి అదృశ్యం

విశాఖ: భర్తతో గొడవపడి తన రెండేళ్ల చిన్నారితో ఇల్లు విడిచి వెళ్లిపోయిన మహిళ.. కూతురి జాడను వెల్లడించలేకపోవడం కలకలం రేపుతోంది. పెందుర్తి నియోజకవర్గం పులిగాలిపాలేనికి చెందిన కుసుమలత ఈ నెల 6వ తేదీన భర్తతో గొడవపడి రెండేళ్ల చిన్నారితో పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. తన భార్య, కుతూరు జాడ తెలియకపోవడంతో పెందుర్తి పోలీసులకు కుసుమలత భర్త కనకరావు ఫిర్యాదు చేశారు. కాగా ఓ కొండపై పశువుల కాపరికి కుసుమలత ఒంటరిగా నీరసంగా కనిపించింది. ఇంటికి తీసుకువెళ్లి భోజనం పెట్టి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కుసుమలతను అదుపులోకి తీసుకుని చిన్నారి ఆచూకీ గురించి పోలీసులు ఆరా తీశారు. అయితే.. చిన్నారికి పాలు లేక ఆకలితో చనిపోయిందని, కొండపై చిన్నారి మృతదేహాన్ని పూడ్చి పెట్టినట్టు కుసుమలత పోలీసులకు బదులిచ్చింది. కుసుమలత చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూడగా చిన్నారి మృతదేహం కనిపించలేదు. చిన్నారి ఆచూకీ కోసం తిరిగి పోలీసులు కుసుమలతను విచారిస్తున్నారు.


Updated Date - 2020-02-11T14:45:17+05:30 IST