మెక్సికోలో బస్సు బోల్తా...12 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2021-06-16T13:30:49+05:30 IST

మెక్సికో దేశంలో జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 12...

మెక్సికోలో బస్సు బోల్తా...12 మంది దుర్మరణం

సియుడాడ్ విక్టోరియా (మెక్సికో): మెక్సికో దేశంలో జాతీయ రహదారిపై బస్సు బోల్తా పడిన దుర్ఘటనలో 12 మంది మరణించారు. ఈశాన్య మెక్సికోలోని తమౌలిపాస్ రాష్ట్రంలో వేగంగా వస్తున్న బస్సు బోల్తా పడింది. సంఘటన స్థలంలో 9 మంది మరణించారు. మరో ముగ్గురిని ఆసుపత్రికి తరలించాక మరణించారు. రేనోసా-న్యువోలియోన్ మోంటెర్రేల మధ్య బస్సు  వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవరు నియంత్రణ కోల్పోయినందున ఈ ప్రమాదం జరిగిందని మెక్సికో అధికారులు చెప్పారు. ఈ ప్రమాద ఘటనలో మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

Updated Date - 2021-06-16T13:30:49+05:30 IST