ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
ABN , First Publish Date - 2021-03-02T06:06:43+05:30 IST
ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ తెలిపారు.
రిమాండ్కు తరలింపు
11 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
చేగుంట, మార్చి 1: ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి చెందిన దొంగరి రాజు హైదరాబాదులో టీ కొట్టు నడుపుతూ ఉండేవాడు. కాగా అతడు మద్యానికి బానిసై, హైదరాబాద్లో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసేవాడు. దొంగలించిన వాహనాలను గ్రామంలో భద్రపరచాడు. రామాయంపేటలో ఒకటి, చేగుంటలో మూడు బైక్లను అదే క్రమంలో దొంగలించాడు. దొంగిలించిన ద్విచక్ర వాహనంపై హైదరాబాదుకు వెళ్తుండగా చేగుంటలో నాకాబందీ నిర్వహిస్తున్న పోలీసులకు చిక్కాడు. పోలీసులు విచారించగా పూర్తి వివరాలు బయటపడ్డాయి. దీంతో అతడి ఇంటి వద్ద నుంచి 11 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు.