ప్రభుత్వ ఉద్యోగాలలో టైప్రైటింగ్, షార్ట్హ్యాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి
ABN , First Publish Date - 2021-10-25T05:10:03+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగాలలో టైప్రైటింగ్, షార్ట్హ్యాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టైప్రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్ చేశారు.
కడప మారుతీనగర్, అక్టోబరు 24 : ప్రభుత్వ ఉద్యోగాలలో టైప్రైటింగ్, షార్ట్హ్యాండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ టైప్రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరాములు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్క్లబ్లో ఆంధ్రప్రదేశ్ టైప్రైటింగ్ ఇన్స్టిట్యూట్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆయ న మాట్లాడారు. వచ్చే 2022 ఫిబ్రవరి నెలలో టైప్రైటింగ్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించాలన్నారు. సంవత్సరానికి రెండు పర్యాయాలు పరీక్షలు జరపాలన్నారు. ఇతర వర్గాలవారికి ఇస్తున్నట్లు రాష్ట్రంలోని టైప్రైటింగ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్స్కు కూడా ఆర్థిక సహాయాలను వర్తింపచేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏజీకే మూర్తి, కోశాధికారి నరసింహులు, ఉపాధ్యక్షుడు నాగరాజు, సభ్యులు పాల్గొన్నారు.