గుండెపోటుతో టైపిస్టు మృతి
ABN , First Publish Date - 2021-04-09T06:38:57+05:30 IST
ఎంపీడీఓ కార్యాలయంలోని టైపిస్టు కే. శ్రీధర్బాబు (48) తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు.
నందికొట్కూరు రూరల్, ఏప్రిల్ 8: ఎంపీడీఓ కార్యాలయంలోని టైపిస్టు కే. శ్రీధర్బాబు (48) తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు. అంతక ముందు రోజు ఆరోగ్యంగా విధులు నిర్వ హించారు. తెల్లవారుజామున గుండె పోటుతో మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇతనికి భార్య, ఇద్ద రు కుమారులు వున్నారు. ఇతను పంచాయతీ రాజ్ అసోసియేషన్ తాలుకా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎంపీడీఓ క్యాథరిన్, ఈఓఆర్డీ సుబ్రమ్మణ్యశర్మ, ఏఓ రాజశేఖర రెడ్డి, రాజేష్, కౌసల్య సంతాపం తెలిపారు.