యూఏఈలో 60 లక్షల మార్క్ను దాటిన కొవిడ్ వ్యాక్సినేషన్ !
ABN , First Publish Date - 2021-02-28T18:34:28+05:30 IST
యూఏఈలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.
అబుధాబి: యూఏఈలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 6.1 మిలియన్ల మందికి టీకా వేయడం జరిగిందని ఆ దేశ ఆరోగ్య, నివారణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 6,015,089 మందికి వ్యాక్సినేషన్ పూర్తైనట్లు తెలియజేసింది. ఈ లెక్కన ప్రతి వందమందిలో 60 మందికిపైగా టీకా తీసుకున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అమెరికాకు చెందిన ఫైజర్, జర్మనీ ఔషధ సంస్థ బయోఎన్టెక్ సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్ను యూఏఈ వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలాఉంటే.. యూఏఈలో తీవ్ర ప్రభావం చూపిస్తున్న మహమ్మారి ఇప్పటి వరకు 3.88 లక్షల మందికి ప్రబలగా.. 1,213 మందిని కబళించింది.