ఎంట్రీ పర్మిట్స్‌ను ప్రారంభించిన యూఏఈ

ABN , First Publish Date - 2020-09-25T13:29:26+05:30 IST

విదేశీయులకు యూఏఈ గుడ్‌న్యూస్ చెప్పింది.

ఎంట్రీ పర్మిట్స్‌ను ప్రారంభించిన యూఏఈ

అబుధాబి: విదేశీయులకు యూఏఈ గుడ్‌న్యూస్ చెప్పింది. సెప్టెంబర్ 24 నుంచి ఎంట్రీ పర్మిట్స్‌ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, వర్క్ పర్మిట్స్‌కు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజెన్షిప్(ఎఫ్ఏఐసీ) గురువారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేసింది. కరోనా మహమ్మారితో కకావికలమైన దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ ప్రణాళికలలో భాగంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు విజిట్ వీసాల జారీని ప్రారంభిస్తున్నట్లు తేలిపింది. కరోనా నిబంధనలు కొనసాగిస్తూనే పర్యాటకులను ఆకర్షించడం, ఆర్థిక కార్యాకలపాలను పెంచడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగా, కొవిడ్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఎఫ్ఏఐసీ మార్చి 17 నుంచి విదేశీయులకు అన్ని వీసాల జారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2020-09-25T13:29:26+05:30 IST