క్వార్టర్స్‌లో భారత్‌ పరాజయం

ABN , First Publish Date - 2021-10-15T07:35:49+05:30 IST

ఉబెర్‌ కప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత మహిళలు 0-3తో జపాన్‌ చేతిలో ఓడి టోర్నీనుంచి నిష్క్రమించారు.

క్వార్టర్స్‌లో భారత్‌ పరాజయం

జపాన్‌తో ఉబెర్‌ కప్‌

ఆర్హస్‌ (డెన్మార్క్‌): ఉబెర్‌ కప్‌ క్వార్టర్‌ఫైనల్లో భారత మహిళలు 0-3తో జపాన్‌ చేతిలో ఓడి టోర్నీనుంచి నిష్క్రమించారు. గురువారం జరిగిన ఈ పోరులో తొలుత.. యువ మాళవికా బాన్సోడ్‌ 12-21, 17-21తో ప్రపంచ నెం. 5 యమగుచి చేతిలో ఓడింది. అనంతరం డబుల్స్‌లో తనీషా/రుతుపర్ణా ద్వయం 8-21, 10-21తో యుకి/మయు చేతిలో  పరాజయం చవిచూశారు.. రెండో సింగిల్స్‌లో అదితీ భట్‌.. సయాకా చేతిలో ఓడింది.


డెన్మార్క్‌తో పురుషుల జట్టు ఢీ:

థామస్‌ కప్‌లో భాగంగా చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో భారత జట్టు 0-4తో పటిష్ట చైనా చేతిలో ఓడింది. ఇప్పటికే క్వార్టర్స్‌ చేరిన భారత పురుషులు ఈ ఓటమితో గ్రూప్‌లో చైనా తర్వాత రెండో స్థానంలో నిలిచారు. శుక్రవారం జరిగే క్వార్టర్‌ ఫైనల్లో డెన్మార్క్‌తో  టీమిండియా తలపడనుంది. చైనాతో పోరులో డబుల్స్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ మాత్రమే నెగ్గారు. సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, సమీ ర్‌ వర్మ, కిరణ్‌ జార్జ్‌ పరాజయం చవిచూశారు. ఆఖ రున..రెండో డబుల్స్‌ జోడీ అర్జున్‌/ధ్రువ్‌ కూడా 24-26, 19-21తో చెంగ్‌/వాంగ్‌ చేతిలో పోరాడి ఓడింది.

Updated Date - 2021-10-15T07:35:49+05:30 IST