యూబీఐ లాభం రూ.1,120 కోట్లు
ABN , First Publish Date - 2021-07-30T05:47:50+05:30 IST
ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జూన్తో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభంలో మూడింతల వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది మొదటి త్రైమాసికంతో పోల్చితే బ్యాంక్ లాభం రూ.340.95 కోట్ల నుంచి రూ.1120.15 కోట్లకు పెరిగింది. సమీక్షా త్రైమాసికంలో ఆదాయం రూ.20,666.62 కోట్లుగా ఉంది. కాగా మొండి బకాయిల కోసం రూ.3593.33 కోట్లు కేటాయించింది. స్థూల ఎన్పీఏలు 14.95 శాతం నుంచి 13.60 శాతానికి దిగి రాగా నికర ఎన్పీఏలు 4.97 శాతం నుంచి 4.69 శాతానికి తగ్గాయి.