374% పెరిగిన యూకో బ్యాంక్‌ లాభం

ABN , First Publish Date - 2021-07-29T05:42:39+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో యూకో బ్యాం క్‌ లాభం

374% పెరిగిన  యూకో బ్యాంక్‌ లాభం

 తొలి త్రైమాసికానికి రూ.102 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ త్రైమాసికంలో యూకో బ్యాం క్‌ లాభం ఆకర్షణీయంగా పెరిగిం ది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసిక లాభం 374 శాతం వృద్ధితో రూ.21.46 కోట్ల నుంచి రూ.102 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. నికర వడ్డీ ఆదాయం 15 శాతానికి పైగా పెరిగి రూ.1,460 కోట్లకు చేరింది. బ్యాంక్‌ ఇతర ఆదాయం కూడా 25 శాతం మేరకు పెరిగి రూ.969 కోట్లుగా నమోదైంది. జూన్‌ చివరి నాటికి మొత్తం వ్యాపారం రూ.3,10,355 కోట్ల నుంచి రూ.3,32,946 కోట్లకు చేరింది.


ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం చివరి నాటికి డిపాజిట్లు రూ.2,12,096 కోట్లకు చేరగా.. ఇందులో కాసా డిపాజిట్లు 38.55 శాతం ఉన్నట్లు బ్యాంక్‌ వెల్లడించింది. నికర నిరర్థక ఆస్తులు రూ.5,138 కోట్ల నుంచి రూ.4,387 కోట్లకు తగ్గాయి. జూన్‌ చివరి నాటికి కనీస మూలధన నిష్పత్తి 14.24 శాతం ఉంది.  

Updated Date - 2021-07-29T05:42:39+05:30 IST