ఆంధ్రజ్యోతి జర్నలిస్టుకు ఉగాది పురస్కారం

ABN , First Publish Date - 2022-04-21T09:13:35+05:30 IST

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాత్రికేయ వ్యవస్థ బలంగా పనిచేయాలని మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు.

ఆంధ్రజ్యోతి జర్నలిస్టుకు ఉగాది పురస్కారం

ఆంధ్రజ్యోతి జర్నలిస్టుకు ఉగాది పురస్కారం

రవీంద్రభారతి, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాత్రికేయ వ్యవస్థ బలంగా పనిచేయాలని మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ చంద్రయ్య అన్నారు. తల్లి తన పిల్లలకు సేవలందించే విధంగా పాత్రికేయులు సమాజానికి సేవ చేస్తున్నారని ఆయన అనందించారు. టీవీ, పత్రికా రంగంలో సేవలందిస్తున్న వారికి బుధవారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో శృతిలయ ఆర్ట్స్‌ అకాడమి, సీల్‌వెల్‌ కార్పొరేషన్‌, తిరుమల బ్యాంక్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది విశిష్ట పురస్కారాలు ప్రదానం చేశారు. దూరదర్శన్‌ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ ఎం.శైలజా జసుమన్‌కు జీవనసాఫల్య పురస్కారం, ఆంధ్రజ్యోతి సిటీ బ్యూరో ఇన్‌చార్జి చామర్తి మురళీధర్‌కు ఉత్తమ పాత్రికేయ శిరోమణి పురస్కారంతో ఘనంగా సత్కరించారు.

Updated Date - 2022-04-21T09:13:35+05:30 IST