టీడీపీ కార్యాలయంలో ఉగాది సంబరాలు
ABN , First Publish Date - 2021-04-14T06:19:46+05:30 IST
ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సంబరాలు జరిగాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలు అన్నెపురెడ్డి వాణి, రిటైర్డ్ సంహాచలం వేదపండితులు వేదుల రవిశంకర్ ప్రసాద్లను ఉగాది పురస్కారాలతో ఘనంగా సన్మానించారు.
మహారాణిపేట, ఏప్రిల్ 13: ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సంబరాలు జరిగాయి. వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలు అన్నెపురెడ్డి వాణి, రిటైర్డ్ సంహాచలం వేదపండితులు వేదుల రవిశంకర్ ప్రసాద్లను ఉగాది పురస్కారాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆహ్వానితులకు తేనీరు, మిఠాయిలు అందించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు బండారు సత్యనారాయణమూర్తి, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, సనపల పాండురంగారావు, కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు, మొల్లి ముత్యాలు, గొలగాని వీరారావు, నజీర్, విల్లూరి చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.