యూజీడీ పనులు నెలాఖరుకి ప్రారంభించాలి
ABN , First Publish Date - 2020-07-08T10:07:47+05:30 IST
గుంటూరు నగరంలో నిలిచిపోయిన యూజీడీ పనులను జూలై నెలాఖరుకి ప్రారంభించాలని రాష్ట్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి
రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు ఆదేశం
గుంటూరు (కార్పొరేషన్), జూలై 7: గుంటూరు నగరంలో నిలిచిపోయిన యూజీడీ పనులను జూలై నెలాఖరుకి ప్రారంభించాలని రాష్ట్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు ఆదేశించారు. నగరంలోని యూజీడీ పనులను, భారత్పేట, నాజ్సెంటర్లోని పలు వార్డు సచివాలయాలను ఆయన మంగళవారం తనిఖీ చేశారు. జోన్ల వారీగా పూర్తయిన పైప్లైన్, మ్యాన్హోల్స్, ఎస్టీపీ పనుల వివరాలను కాంట్రాక్ట్ సంస్థ పీడీని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా పనుల పురోగతిపై సమీక్షించి నగర కమిషనర్ తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సచివాలయాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు, లబ్ధిదారుల జాబితాను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. కమిషనర్ అనురాధ మాట్లాడుతూ సచివాలయ పర్యవేక్షణకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించామని, ప్రతి సోమవారం వారు తనిఖీ చేస్తారని తెలిపారు.