బ్రిటన్ ప్రభుత్వ తాజా నిర్ణయం.. భారతీయులకు లబ్ధి..!

ABN , First Publish Date - 2020-05-24T02:36:29+05:30 IST

కరోనా వైరస్ నేపథ్యంలో బ్రిటన్‌లో చిక్కుకున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో విల

బ్రిటన్ ప్రభుత్వ తాజా నిర్ణయం.. భారతీయులకు లబ్ధి..!

లండన్: కరోనా వైరస్ నేపథ్యంలో బ్రిటన్‌లో చిక్కుకున్న భారతీయులకు అక్కడి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కరోనా మహమ్మారి ప్రపంచ దేశాల్లో విలయతాండం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచం మొత్తం స్వీయ నిర్భంధంలోకి వెళ్లిపోయింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో అనేక మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలో వీసాల గడువు ముగిసినప్పటికీ బ్రిటన్‌లో ఉండిపోయిన భారతీయులకు, ఇతర దేశాల పౌరులకు అక్కడి ప్రభుత్వం ఊరట నిచ్చింది. మే 31 వరకు అన్ని రకాల వీసాల గడువును పొడగిస్తూ గతంలో నిర్ణయం తీసుకుంది. అయితే పొడగించిన గడువు సమీపిస్తుండటం.. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇంకా ఆంక్షలు అమలులో ఉండటంతో మరోసారి అన్ని రకాల వీసాల గడువును మరో రెండు నెలలపాటు పొడించింది. ఈ మేరకు యూకే హోం సెక్రటరీ ప్రీతీ పటేల్ ప్రకటించారు. కరోనా కారణంగా బ్రిటన్‌లో చిక్కుకున్న విదేశీ పౌరుల వీసా గడువును జూలై 31 వరకు పొడగిస్తున్నట్లు పేర్కొన్నారు. మే 31తో గడువు ముగుస్తున్న, ముగిసిన అన్ని రకాల వీసాల గడువును మరో రెండు నెలలపాటు పొడగిస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా.. బ్రిటన్ ప్రభుత్వ తాజా ప్రకటనతో ఆ దేశంలో చిక్కుకున్న భారతీయులకు లబ్ధి చేకూరనుంది. 


Updated Date - 2020-05-24T02:36:29+05:30 IST