విజయ్‌ మాల్యా అప్పగింతలో ట్విస్ట్‌ !

ABN , First Publish Date - 2020-06-05T14:19:30+05:30 IST

పరారీ నేరగాడు విజయ్‌ మాల్యా అప్పగింత మరి కొంత జాప్యం కావచ్చునని బ్రిటన్‌ తేల్చి చెప్పింది.

విజయ్‌ మాల్యా అప్పగింతలో ట్విస్ట్‌ !

న్యూఢిల్లీ: పరారీ నేరగాడు విజయ్‌ మాల్యా అప్పగింత మరి కొంత జాప్యం కావచ్చునని బ్రిటన్‌ తేల్చి చెప్పింది. చట్టపరమైన సమస్య ఒకటి పరిష్కారం కావలసిఉన్నదంటూ అప్పటివరకు అప్పగింత ఆలస్యం కాక తప్పదని బ్రిటిష్‌ ప్రభుత్వం తెలియచేసింది. ఎంత కాలంలో ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నది తాము చెప్పలేమని రాయబార కార్యాలయం ప్రతినిధి ఒకరన్నారు. అయితే ఆ సమస్య ఏమిటనేది తాము వెల్లడించలేమని, అది అత్యంత గోప్యమని ఆయన చెప్పారు. తన అప్పగింతను సవాలు చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేయడంతో ఏ క్షణాన అయినా మాల్యా భారత్‌కు రావచ్చునంటూ కొన్ని వర్గాల్లో సాగిన ఊహాగానాలు దీనితో తెర పడింది.  

Updated Date - 2020-06-05T14:19:30+05:30 IST