అల్ట్రాటెక్ జోరు... ఇంట్రాడేలో రూ. 280 కి పైగా లాభం...

ABN , First Publish Date - 2022-01-18T01:51:23+05:30 IST

మూడో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఈ రోజు(సోమవారం) ఇంట్రాడేలో 5 శాతానికిపైగా పెరిగి, రూ. 7,946 ధరకు చేరాయి.

అల్ట్రాటెక్ జోరు... ఇంట్రాడేలో రూ. 280 కి పైగా లాభం...

మూడో త్రైమాసికంలో అల్ట్రాటెక్ సిమెంట్ నికరలాభం రూ. 1,584 కోట్లు

హైదరాబాద్ : మూడో త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు ఈ రోజు(సోమవారం) ఇంట్రాడేలో 5 శాతానికిపైగా పెరిగి,  రూ. 7,946 ధరకు చేరాయి. ముగింపు సమయానికి 2.74 శాతం లాభంతో రూ. 7,870.10 వద్ద ముగిసాయి. కాగా... 2022 ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అల్ట్రాటెక్ సిమెంట్ నికరలాభం రూ. 1,708 కోట్లుగా నమోదు కాగా, ఆదాయం రూ. 12,985 కోట్లకు  చేరింది.లాభంలో 7. 8 శాతం వృద్ధి నమోదు కాగా, గతేడాది మూడో త్రైమాసికంలో అల్ట్రాటెక్ సిమెంట్ నికరలాభం రూ. 1,584 కోట్లు కాగా, కిందటి త్రైమాసికంలో  రూ. 1,314 కోట్లు మాత్రమే. అంటే అటు సీక్వెన్షియల్‌గా, క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన కూడా అల్ట్రాటెక్ మంచి ప్రదర్శననిచ్చినట్లే. కాగా... గ్రాస్ మార్జిన్లలో మాత్రం తగ్గుదల కనిపించింది.  (అమ్మకాలకు..ఉత్పత్తుల ధరకు  మధ్య ఉండే వ్యత్యాసమే గ్రాస్ మార్జిన్. బొగ్గు, పెట్‌కోక్, ఆయిల్ ధరలతో రవాణా వ్యయం పెరగడంతో ఈ గ్రాస్ మార్జిన్లు బాగా దెబ్బతిన్నట్లు అల్ట్రాటెక్ సిమెంట్ ప్రకటించింది. 

Updated Date - 2022-01-18T01:51:23+05:30 IST