అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-18T06:28:07+05:30 IST

అప్పుల బాధ తట్టుకోలేక మనస్థాపం చెందిన ఓ యువకుడు సైనైడ్‌ తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు.

అప్పుల బాధ తట్టుకోలేక యువకుడు ఆత్మహత్య
అభిషేక్‌ (ఫైల్‌)

నకిరేకల్‌, జనవరి 17: అప్పుల బాధ తట్టుకోలేక మనస్థాపం చెందిన ఓ యువకుడు సైనైడ్‌ తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన నకిరేకల్‌లో సోమవారం చోటు చేసుకుంది. నకిరేకల్‌ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.... మహారాష్ట్రకు చెందిన హన్మంతు కుటుంబం 30 సంవత్సరాల క్రితం నకిరేకల్‌లో స్థిరపడ్డారు. హన్మంతు కుమారుడు చౌహాన అభిషేక్‌(24) అనే యువకుడు కొంత కాలం నుంచి పట్టణంలోని సంఘం కాంప్లెక్స్‌ సమీపంలో బంగారం దుకాణం నిర్వహిస్తున్నాడు. బంగారం దుకాణంలో నష్టం వచ్చింది. దీంతో అప్పులు పెరగడంతో బాధ తట్టుకోలేక సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సైనైడ్‌ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి హన్మంతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 


Updated Date - 2022-01-18T06:28:07+05:30 IST