సిరిసిల్లలో అండర్‌ డ్రెయినేజీ నిర్మాణం

ABN , First Publish Date - 2020-06-03T10:07:39+05:30 IST

సిరిసిల్ల మున్సిపల్‌ పరిఽ దిలో అండర్‌ డ్రైనేజీ నిర్మాణం చేయడానికి ప్రణాళిక రూ పొందిస్తున్నట్లు పురపాలక ఐటీ శాఖ మంత్రి కే

సిరిసిల్లలో అండర్‌ డ్రెయినేజీ నిర్మాణం

పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు 

ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం పరిశీలన 


సిరిసిల్ల, జూన్‌ 2(ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల మున్సిపల్‌ పరిఽ దిలో అండర్‌ డ్రైనేజీ నిర్మాణం చేయడానికి ప్రణాళిక  రూ పొందిస్తున్నట్లు పురపాలక ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మంగళవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో పద్మా నగర్‌ వద్ద ప్రధాన మురికి కాలువను పరిశీలించారు. మురి కి కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగించాలని, లైనిం గ్‌, మరమ్మతు చేయాలని సూచించారు.


దోమలు ఎక్కు వగా ఉన్నాయని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వర్షాకాలంలో దోమల బెడద లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ అధికారులను సూచించారు. ఈదుల చెరువు వద్ద శ్మశాన వాటిక స్థల వివాదాన్ని స్థానిక కౌన్సి లర్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్ర స్థాయిలో పరిశీలి ంచాలని ఆర్డీవోను మంత్రి ఆదేశించారు. ఆర్డీవో శ్రీనివాస రావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, కమిషనర్‌ సమ్మ య్య, వైస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌, కౌన్సిలర్లు దిడ్డి మాధవి, రాపెల్లి లక్ష్మీనారాయణ, పూర్ణచందర్‌, గెంట్యాల శ్రీనివాస్‌, ఈఈ వెంకటశేషయ్య ఉన్నారు. 

Updated Date - 2020-06-03T10:07:39+05:30 IST