భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలి
ABN , First Publish Date - 2022-01-26T05:27:22+05:30 IST
పట్టణంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ అధికారులను చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ఆదేశించారు.
రాయచోటి, జనవరి 25: పట్టణంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని మున్సిపల్ అధికారులను చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాయచోటి పట్టణంలోని తన కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్బాషా, జడ్పీ మాజీ చైర్మన్ దేవనాధరెడ్డిలతో కలిసి మున్సిపల్ అభివృద్ధి పనులపై ఆయన సమీక్షించారు. వివిధ నిర్మాణదశల్లో ఉన్న పనుల స్థితిగతులపై ఆరాతీశారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనుల నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. ఇప్పటి వరకు రూ.30కోట్ల మేర భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని ఆయన తెలిపారు. పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఈ సుధాకర్నాయక్, పబ్లిక్ హెల్త్ ఏఈ కావ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, వైసీపీ నేతలు పాల్గొన్నారు.