నిరుద్యోగ భృతి ఇవ్వాలి: టీడీపీ టీఎస్‌

ABN , First Publish Date - 2021-01-26T08:58:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఖాళీలు భర్తీ చేయాలని టీడీపీటీఎస్‌ విజ్ఞప్తి చేసింది

నిరుద్యోగ భృతి ఇవ్వాలి: టీడీపీ టీఎస్‌

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వాలని, న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా ఖాళీలు భర్తీ చేయాలని టీడీపీటీఎస్‌ విజ్ఞప్తి చేసింది. సోమవారం ఎన్టీఆర్‌ భవన్‌లో టీఎ్‌స-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అధ్యక్షతన, కంభంపాటి రామ్మోహన్‌రావు సమక్షంలో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. కేంద్ర నూతన వ్యవసాయ చట్టంలో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాల్సిన అవశ్యకత ఉందని వారు అన్నారు. కాగా, ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని టీఎ్‌స-టీడీపీ శ్రేణులకు వారు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 5లోగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

Updated Date - 2021-01-26T08:58:35+05:30 IST