‘నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’

ABN , First Publish Date - 2022-01-29T04:32:53+05:30 IST

‘నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’

‘నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే’
మాట్లాడుతున్న పాలకుర్ల రవికాంత్‌ గౌడ్‌

ఆమనగల్లు, జనవరి 28: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పాలకుర్ల రవికాంత్‌గౌడ్‌ అన్నారు. పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ యువజన కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే  నిరుద్యోగభృతి కల్పించాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  సమావేశంలో యువజన కాంగ్రెస్‌ కల్వకుర్తి నియోజకవర్గ అధ్యక్షుడు అనిల్‌, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణ నాయక్‌, నాయకులు శ్రీకాంత్‌, రాజు, రాఘవేందర్‌, అలీం, సురేష్‌ నాయక్‌ పాల్గొన్నారు. నేడు కల్వకుర్తిలోని ఎమ్మెల్యే జైపాల్‌ యాదవ్‌ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తున్నట్లు యువజన కాంగ్రెస్‌ ఆమనగల్లు పట్టణాధ్యక్షుడు వస్పుల శ్రీకాంత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

Updated Date - 2022-01-29T04:32:53+05:30 IST