బిజినెస్ మ్యాన్‌కు యువతి టార్చర్ .. ఆ వీడియో బయటపెడతానంటూ మూడేళ్లుగా..

ABN , First Publish Date - 2021-10-18T03:19:29+05:30 IST

బిజినెస్ మ్యాన్‌కు చుక్కలు చూపించిన యువతి..పోలీస్ స్టేషన్ బాట పట్టిన బాధితుడు..

బిజినెస్ మ్యాన్‌కు యువతి టార్చర్ .. ఆ వీడియో బయటపెడతానంటూ మూడేళ్లుగా..

ఇంటర్నెట్ డెస్క్: ఓ యువతిని నడిరోడ్డుపై చితకబాదుతున్న వ్యాపారికి సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల రాజస్థాన్‌లో తెగ వైరల్ అయింది. పాలీ జిల్లా సుమేర్‌పూర్ నగరంలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా పెను కలకలం సృష్టించింది. ఈ క్రమంలో ఆ యువతి వ్యాపారిపై పోలీసు కేసు పెట్టింది. తాజాగా ఈ కేసులో మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఆ యువతే తనను మూడేళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తూ 10 లక్షలు దోచుకుందని సదరు వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


వ్యాపారి నరేశ్ కుమార్ ఫిర్యాదు ప్రకారం.. 2018లో సదరు యువతి ఒక రోజు అతడి ఎలక్ట్రానిక్ షాపుకు వచ్చి ఫ్యాను కొనుగోలు చేసింది. ఆ తరువాత.. ఇంట్లో ఫ్యాను బిగించాలంటూ అతడిని తన ఇంటికి తీసుకెళ్లింది. అప్పటికే ఇంట్లో ఉన్న రమేశ్ అనే వ్యక్తి సాయంతో ఆమె నరేశ్‌ను చితకబాదింది. అంతేకాకుండా.. అతడి నగ్న వీడియోను రికార్డు చేసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియో వైరల్ చేస్తానంటూ బెదిరించి అతడి వద్ద ఉన్న నగలు, డబ్బు, మొబైల్ ఫోన్ తీసుకుంది. 


అది మొదలు..తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని నరేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె నుంచి తప్పించుకునేందుకు మరో నగరానికి వెళ్లినా కూడా ఫలితం లేకపోయిందని వాపోయాడు. వారికి అవసరమైనప్పుడల్లా తన నుంచి లక్షలకు లక్షలు తీసుకుని వెళ్లిపోయేవారని చెప్పాడు. వారికి భయపడి ఇప్పటివరకూ రూ. 10 లక్షలు నష్టపోయానని చెప్పాడు. ఈ మేరకు సుమేర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మరోవైపు.. నరేశ్ తన మర్గాంగాలపై కారం జల్లాడంటూ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో.. ఈ కేసు స్థానిక పోలీసులకు ఓ చిక్కు ప్రశ్నగా మారింది. 

Updated Date - 2021-10-18T03:19:29+05:30 IST