మరువలేని మహానేత ఎన్టీఆర్
ABN , First Publish Date - 2022-01-19T05:21:28+05:30 IST
పేదరికం లేని సమాజం నిర్మించేందుకు దివంగత ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని టీడీపీ నేతలు లక్ష్మిరెడ్డి, గోవర్థన్రెడ్డి, హరిప్రసాద్ కొనియాడారు.
కడప, జనవరి 18(ఆంధ్రజ్యోతి) : పేదరికం లేని సమాజం నిర్మించేందుకు దివంగత ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని టీడీపీ నేతలు లక్ష్మిరెడ్డి, గోవర్థన్రెడ్డి, హరిప్రసాద్ కొనియాడారు. ఎన్టీఆర్ 26వ వర్థంతిని పురస్కరించుకొని మంగళవారం కొండాయపల్లెలో మన్నెంచలపతి నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్కు ఘన నివాళులర్పించారు. ఈ సందర ్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయ్యాక కిలో బియ్యం రెండు రూపాయలకే అందించారన్నారు.