గుర్తుతెలియని యాచకుడి మృతి
ABN , First Publish Date - 2022-01-17T06:50:55+05:30 IST
పట్టణంలోని ప్రధాన రహదారులపై యా చకుడిగా సంచరిస్తున్న 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి శనివారం సీతారాంపురం చిన్నమసీదు సమీపంలో మృతి చెందాడు.
మిర్యాలగూడ అర్బన, జనవరి 16: పట్టణంలోని ప్రధాన రహదారులపై యా చకుడిగా సంచరిస్తున్న 35 ఏళ్ల గుర్తు తెలియని వ్యక్తి శనివారం సీతారాంపురం చిన్నమసీదు సమీపంలో మృతి చెందాడు. మృతుడు నలుపు రంగు ప్యాంటు, ఎరుపు, న ల్లని గీతలు కలిసిన టీ షర్టు ధరించి ఉన్నాడు. అనారోగ్యం, చలి తీవ్రతకు తట్టుకోలేక మృతి చెందినట్లు టూటౌన సీఐ సురేష్ తె లిపారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 944073198 నెంబర్ను సంప్రదించాలని సీఐ కోరారు.