గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-04-20T05:44:25+05:30 IST
సంగారెడ్డి జిల్లా కంది మండల పరిదిలోని బేగంపేట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు.
కంది, ఏప్రిల్ 19: సంగారెడ్డి జిల్లా కంది మండల పరిదిలోని బేగంపేట గ్రామ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో సోమవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. బేగంపేట గ్రామంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో కొందరు గ్రామస్థులు కూలి పనికి వెళ్లారు. అక్కడ మృతదేహం కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంగారెడ్డి రూరల్ ఎస్ఐ సుభాష్ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడి వయస్సు 35 సంవత్సరాలు ఉంటుందని, వివరాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. బేగంపేట పంచాయతీ కార్యదర్శి అంబర్సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.