గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-01-24T05:31:18+05:30 IST

పట్టణంలోని పైతోట సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్న సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలు గుచూసింది.

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

రాయదుర్గంటౌన, జనవరి 23: పట్టణంలోని పైతోట సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్న సంఘటన ఆలస్యంగా ఆదివారం వెలు గుచూసింది. అర్బన సీఐ సురేష్‌ బాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నాలుగైదు రోజుల క్రితమే ఘటన జరిగినట్లు అను మానిస్తున్నారు. మృతుడు తెల్లని పంచెతో ఉరికి వేలాడుతుండగా, తెలుపు రంగు షర్టు, నీలపు రంగు నిక్కరు ధరించి వున్నట్లు తెలిపారు. అతని వయ సు సుమారు 65 సంవత్సరాలు వుండవచ్చనన్నారు. మృతుని వివరాలు తెలియాల్సి వుందన్నారు. గొర్రెల కాపరుల సమాచారంతో వీఆర్వో ఫిర్యాదు మేర కు కేసు దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.  


కుందనకోటలో వివాహిత..

యాడికి, జనవరి 23: మండలంలోని కుందనకోట  గ్రామంలో కడుపునొప్పి తాళలేక విషద్రావకం తాగి వి వాహిత పెద్దక్క (36) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివి. కుందనకోట గ్రామానికి చెందిన బాలపెద్దయ్య భార్య పెద్దక్క రెండేళ్లుగా క డుపునొప్పితో బాధపడుతుండేది. దీంతో మనస్తాపం చెంది విషద్రావకం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. మృ తురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-01-24T05:31:18+05:30 IST