హాథ్రస్‌లో మళ్లీ ఉద్రిక్తత.. ఆప్ ఎంపీపై ఇంకు చల్లిన అగంతకుడు

ABN , First Publish Date - 2020-10-05T22:42:45+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో మళ్లీ ఉద్రిక్తత తలెత్తింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌పై..

హాథ్రస్‌లో మళ్లీ ఉద్రిక్తత.. ఆప్ ఎంపీపై ఇంకు చల్లిన అగంతకుడు

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో మళ్లీ ఉద్రిక్తత తలెత్తింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఇంక్ చల్లడంతో సోమవారంనాడు ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. హాథ్రాస్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆప్ ప్రతినిధి బృందం వెళ్లినపుడు ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఇంటి నుంచి బయటకు వచ్చి, మీడియాతో సంజయ్ సింగ్‌ మాట్లాడుతుండగా, ఒక వ్యక్తి ఆయనపై నల్ల ఇంకు చల్లారు. దాంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు.


సంజయ్ సింగ్‌తో పాటు హాథ్రాస్ వెళ్లిన ప్రతినిధి బృందంలో పంజాబ్ ఆప్ విపక్ష నేత హర్పాల్ సింగ్ చీమా, ఎమ్మెల్యేలు రూపిందర్ కౌర్ రూబీ, బల్దేవ్ సింగ్ జైతో, మంజిత్ సింగ్ బిలాస్‌పూర్, కుల్వంత్ సింగ్ పండోరి తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-10-05T22:42:45+05:30 IST