రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతి
ABN , First Publish Date - 2021-06-13T05:14:40+05:30 IST
రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ మృతిచెందిన సంఘటన శ్రీకాళహస్తిలో జరిగింది.
శ్రీకాళహస్తి అర్బన్, జూన్ 12: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ(35) మృతిచెందిన సంఘటన శనివారం శ్రీకాళహస్తిలో జరిగింది. రేణిగుంట రైల్వే ఎస్ఐ అనిల్కుమార్ కథనం మేరకు... రేణిగుంట నుంచి గూడూరువైపు వెళుతున్న రైలుకు ఎదురుగా వచ్చి శనివారం ఉదయం ఓ గుర్తుతెలియని మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే సిబ్బంది గుర్తించి వివరాలు ఆరా తీయగా లభ్యం కాలేదు. దీంతో గుర్తుతెలియని మహిళ మృతిచెందినట్లు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతురాలి బంధువులు శ్రీకాళహస్తి రైల్వే పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు.