భారత్‌లో యూనిలివర్‌ మౌత్‌వాష్‌ ఫార్ములేషన్‌

ABN , First Publish Date - 2020-11-22T10:06:23+05:30 IST

ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ యూనిలివర్‌ మౌత్‌వా్‌ష ఫార్ములేషన్‌ను ఇండియాకు తీసుకురానుంది. ఈమేరకు శనివారం ఆ కంపెనీ

భారత్‌లో యూనిలివర్‌ మౌత్‌వాష్‌ ఫార్ములేషన్‌

న్యూఢిల్లీ, నవంబరు 21: ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీ యూనిలివర్‌ మౌత్‌వా్‌ష ఫార్ములేషన్‌ను ఇండియాకు తీసుకురానుంది. ఈమేరకు శనివారం ఆ కంపెనీ ఒక ప్రకటన చేసింది. తమ మౌత్‌వా్‌షను 30 సెకన్లపాటు పుకిలించడం వల్ల 99.9 శాతం కొవిడ్‌ వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందని పేర్కొంది. ఆమేరకు తమ ప్రాథమిక ల్యాబ్‌ టెస్టుల్లో ఫలితాలు అగుపించినట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.  రోజూ మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రపర్చుకోవడంతోపాటు మౌత్‌వా్‌షను ఉపయోగించడం తప్పనిసరైందని యూనిలివర్‌ పేర్కొంది.

Updated Date - 2020-11-22T10:06:23+05:30 IST