ఐసీయూలో కేంద్ర మంత్రి
ABN , First Publish Date - 2020-09-21T22:46:19+05:30 IST
ఐసీయూలో కేంద్ర మంత్రి
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీ ఆస్పత్రిలో ఐసీయూలో చేరారు. ప్రస్తుతం రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీ ఆస్పత్రిలో ఐసీయూలో ఉన్నారని ఆయన కుమారుడు, ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ వెల్లడించారు. తన తండ్రి అనారోగ్యం కారణంగా బీహార్లో పార్టీ కార్యకర్తలను కలవలేనని చిరాగ్ అన్నారు. తన తండ్రి తన ఆరోగ్య సమస్యలను విస్మరించి, కరోనా వైరస్ సంక్షోభ సమయంలో ప్రజలకు సేవ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు.