వ్యవ‘సాయ’మే ఆర్థిక వ్యవస్థకు అండ
ABN , First Publish Date - 2020-08-05T06:44:41+05:30 IST
కొవిడ్తో ఆర్థిక వ్యవస్థకు పట్టిన కష్టాలు వీడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్ ఎత్తివేత, నిబందనల సడలింపుతో
- కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: కొవిడ్తో ఆర్థిక వ్యవస్థకు పట్టిన కష్టాలు వీడుతున్న సూచనలు కనిపిస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది. లాక్డౌన్ ఎత్తివేత, నిబందనల సడలింపుతో కొన్ని రంగాలు ఇప్పటికే గాడిలో పడుతున్నట్టు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం వరుణుడు సకాలంలో కరుణించడంతో ఆర్థిక వ్యవస్థకు వ్యవ‘సాయ’మే పెద్ద అండ అని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్ధిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన ఒక నివేదిక ఈ విషయాలు పేర్కొంది. కొవిడ్తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యలూ ఇందుకు దోహదం చేస్తాయని పేర్కొంది. ప్రభుత్వ గోధుమల కొనుగోళ్ల ద్వారా నే రైతులకు రూ.75,000 కోట్లు అందిన విషయాన్ని ఆ నివేదిక గుర్తు చేసింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేసింది. అయితే పెరుగుతున్న కరోనా కేసులు, లాక్డౌన్లు దీనికి గండికొట్టే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.