విదేశాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘించొద్దు
ABN , First Publish Date - 2021-05-12T10:44:26+05:30 IST
టోర్నీల్లో పాల్గొనేందుకు లేదా శిక్షణ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు భారత క్రీడాకారులు కొవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించొద్దని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం హెచ్చరించారు.
అథ్లెట్లకు కేంద్ర క్రీడా మంత్రి రిజిజు హెచ్చరిక
న్యూఢిల్లీ: టోర్నీల్లో పాల్గొనేందుకు లేదా శిక్షణ కోసం విదేశాలకు వెళ్లినప్పుడు భారత క్రీడాకారులు కొవిడ్ ప్రోటోకాల్ను ఉల్లంఘించొద్దని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు మంగళవారం హెచ్చరించారు. టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన భారత షూటర్లు మంగళవారం క్రొయేషియా టూర్కు పయన మయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రిజిజు.. ‘క్షేమంగా వెళ్లి రండి. విదేశాల్లో కొవిడ్ ప్రోటోకాల్ అతిక్రమించొద్దు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా, సురక్షితంగా ఉండండి. శిక్షణపైనే దృష్టిపెట్టండి. అథ్లెట్లకు, కోచ్లకు అవసరమైన అన్ని సహాయసహకారాలు మేం అందిస్తాం’ అని ట్వీట్ చేశారు.