మసీద్‌కెళ్లిన ప్రొఫెసర్‌పై హత్యాయత్నం చేసిందెవరు..!?

ABN , First Publish Date - 2021-07-03T14:21:29+05:30 IST

నమాజ్‌ కోసం మసీద్‌కు వెళ్లిన ఓ ప్రొఫెసర్‌పై గుర్తు తెలియని దుండగులు

మసీద్‌కెళ్లిన ప్రొఫెసర్‌పై హత్యాయత్నం చేసిందెవరు..!?

హైదరాబాద్ సిటీ/లంగర్‌హౌజ్‌ : నమాజ్‌ కోసం మసీద్‌కు వెళ్లిన ఓ ప్రొఫెసర్‌పై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడిచేసి, హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గోల్కొండ పోలీ‌స్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో షేక్‌పేట్‌ జైహింద్‌నగర్‌ కాలనీకి చెందిన ప్రొఫెసర్‌ మహ్మద్‌ నజీర్‌ హైమద్‌(53) కోఠి ఉమెన్స్‌ కాలేజీలో అడిషనల్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నమాజ్‌ కోసం ఆయన గుల్సన్‌ కాలనీలోని మసీద్‌కు వచ్చాడు. నమాజ్‌ ముగించుకొని తిరిగి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఆటోలో వచ్చిన నలుగురు దుండగులు వాహనాన్ని అడ్డగించారు. ప్రొఫెసర్‌పై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. తీవ్ర గాయాలతో రక్తం మడుగులో పడివున్న నజీర్‌ హైమద్‌ను స్థానికులు ఓ ఆస్పత్రికి తరలించారు. గోల్కొండ పోలీసులు హత్యాయత్నం జరిగిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. నజీర్‌ హైమద్‌ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యప్తులో ఉందని ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-07-03T14:21:29+05:30 IST